![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -58 లో.....శకుంతల ఇంటికి వస్తుంది. ఏంటి అక్క డిస్సపాయింట్ అయ్యావా అని శకుంతలకి చిరాకు తెప్పించేలా ఇందుమతి మాట్లాడుతుంటుంది. నేను కేసు పెట్టింది తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలని అని ఇందుమతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్ర రాగానే గంగ తనకి దిష్టి తీస్తుంది. అది చూసి గతంలో శకుంతల దిష్టి తీసింది రుద్ర గుర్తుచేసుకుంటాడు.
ఆ తర్వాత ఇందుమతి కేసు గురించి తన భర్తని చిరాకు పెడుతుంది. మరొకవైపు పెద్దసారు, రుద్ర కలిసి సంఘటన రిక్రియేట్ చేసే దగ్గరికి వెళ్తుంటే నేను వస్తానని గంగ అంటుంది. వద్దని రుద్ర అంటాడు. పెద్దసారు, గంగ కలిసి మేనేజ్ చేసి గంగని తమ వెంట తీసుకొని వెళ్లేలా చేస్తారు. వీరు వెళ్తుంటే.. ఇషిక ఆపి భాను బావగారి హత్య కేసులో నీ హస్తం ఉందో లేదో కానీ రుద్ర బావ ఈ తప్పు చేయలేదని బుజువు కాకుండా చూసుకోమని వీరుకి ఇషిక సలహా ఇస్తుంది.
సంఘటన రీక్రియేట్ దగ్గరికి వెళ్తారు.. బ్లూ టీమ్ వాళ్ళు రీక్రియేట్ చేస్తారు. అందులో రుద్ర ఫోర్స్ గా భానుని నెట్టితే కింద పడిపోయాడని వాళ్ళు అంటారు. అలా ఎలా తేలుస్తారని గంగ అడ్డుపడుతుంది. ఆ తర్వాత నేను రి క్రియేట్ లో ఉంటాను.. భాను ప్లేస్ లో రుద్ర నువ్వు ఉండమని అంటారు. వద్దు బావ రిస్క్ అని వీరు అంటాడు. నేను భాను గారి ప్లేస్ లో ఉంటానని గంగ అంటుంది. వద్దని రుద్ర తనపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |